‘స్నేహమా… ప్రేమా… ఆకర్షణా..?’ అన్న ట్యాగ్లైన్తో బి.ఆర్.యస్.ఐ.మూవీస్ పతాకంపై పోల్కంపల్లి నరేందర్ నిర్మిస్తున్న మెసేజ్ ఓరియంటెడ్ యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ ‘ట్వంటీ ఫస్ట్ సెంచరీ లవ్’. ట్వంటీ ఫస్ట్ సెంచరీ లవ్’ సినిమా చూసినవారెవరైనా తమకు నచ్చలేదని సహేతుకంగా వివరిస్తే.. లక్ష రూపాయలు బహుమతి ఇస్తామని దర్శకనిర్మాతలు సమావేశంలో ప్రకటించారు.గోపీనాథ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ‘కబాలి’తోపాటు ఈ నెల 23న ఆంధ్ర మరియు తెలంగాణాల్లో విడుదలవుతోంది.
విష్ణుప్రియ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో థర్టీ ఇయర్స్ పృధ్వీ, నల్ల వేణు, సుమన్శెట్టి, సూర్య, చిత్రం శ్రీను, జూనియర్ రేలంగి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. థియేటర్లు దొరకని పరిస్థితుల్లో ఇప్పటికి రెండుమూడు పర్యాయాలు వాయిదా పడ్డ ‘ట్వంటీ ఫస్ట్ సెంచరీ లవ్’ చిత్రం ఎట్టకేలకు ‘కబాలి’ విడుదలైన మరుసటి రోజు, అనగా జూలై 23న విడుదల కానుందని దర్శకనిర్మాతలు గోపీనాథ్, నరేందర్లు అన్నారు. అయితే పబ్లిసిటీ కోసం ఇలా ‘ప్రకటించారా..? లేదా.. నిజంగానే ఇస్తారా అన్న అనుమాలు మాత్రం లేకపోలేదు..