వైసీపీ ఆరోపణలకు ఆ మంత్రి ఊతం?

0
628
ayyanna patrudu says tdp bjp and jana sena going to participate together in 2019 elections

Posted [relativedate]

ayyanna patrudu says tdp bjp and jana sena going to participate together in 2019 elections
టీడీపీ,బీజేపీ,జనసేన కాంబినేషన్ లో 2019 ఎన్నికలు జరుగుతాయా? ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ వైఖరి చూసిన వారు ఎవరికీ ఈ నమ్మకం కలగదు.ఇంకా కొంతమంది అయితే మరో అడుగు ముందుకెళ్లి అసలు టీడీపీ,బీజేపీ మధ్యే పొత్తు ఉంటుందో లేదో అంటున్నారు. కానీ ఓ మంత్రిగారు మాత్రం వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ,బీజేపీ,జనసేన కలిసే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఎదుర్కొంటాయని అంటున్నారు.ఆయనే అయ్యన్న పాత్రుడు. ఆయన ఈ మాట చెప్పగానే ఆశ్చర్యపోవడం విలేకరుల వంతు అయింది. ఇదెలా సాధ్యం అని ఆయన్ని అడిగితే అయ్యన్న “కావాలంటే ఓ కాగితం మీద రాసి పెట్టుకోండి.అప్పుడు ఏమి జరుగుతుందో చూడండి” అని జవాబు ఇచ్చారు.మంత్రి గారి వ్యాఖ్యలతో వైసీపీ సంబరపడుతోంది.ఎందుకంటే..

ప్రతిపక్ష పాత్రలో జనాల్లోకి వెళుతున్న పవన్ కళ్యాణ్ ని కంట్రోల్ చేయడానికి వైసీపీ పదేపదే చేసే ఓ ఆరోపణ చేస్తుంది.జనసేన అనేది టీడీపీ …ముఖ్యంగా చంద్రబాబు చెప్పుచేతల్లో నడుస్తుందని వైసీపీ ఆరోపిస్తూనే వుంది.అయితే ఆ ఆరోపణల్ని జనసేన,టీడీపీ ఖండిస్తూ వస్తున్నాయి.కానీ ఇప్పుడు అయ్యన్న వ్యాఖ్యలతో ఆ ఆరోపణలకు బలం చేకూరినట్టైంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్ లో అయ్యన్న కామెంట్స్ వైసీపీ కి అవకాశంగా మారొచ్చు.ఇలాంటి విషయాల్లో కామెంట్ చేసేటప్పుడు తమకు భవిష్యత్ పరిణామాలు తెలుస్తాయని చెప్పేందుకు ప్రాధాన్యం ఇవ్వడం కన్నా పార్టీ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని మాట్లాడితే మంచిది. ఈ విషయంలో సీనియర్ నేతలకు ఎవరైనా ప్రత్యేకంగా చెప్పాలా?

Leave a Reply