Posted [relativedate]
2015లో మహేష్ బాబు.. కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన శ్రీమంతుడు సినిమా అప్పట్లో టాలీవుడ్ లో సెన్సేషన్ ని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్ రానుందా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ప్రస్తుతం మహేష్.. మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ మళ్లీ కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి భరత్ అనే నేను అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం.
ఈ సినిమా శ్రీమంతుడు సినిమాకి సీక్వెల్ అట. ఇందులో మహేష్ లండన్ రిటర్న్డ్ మిలీనియర్ గా కనిపించబోతున్నాడట. ఈ సినిమాలో కూడా శ్రీమంతుడు-1 హీరోయిన్ శృతిహాసన్ నే సెలెక్ట్ చేయనున్నాడట కొరటాల శివ. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలుపెట్టాడు కొరటాల. ప్రస్తుతం మహేష్.. మురుగదాస్ సినిమా షూటింగ్ పూర్తి అవ్వగానే ఈ సినిమా పట్టాలెక్కనుంది. మరి శ్రీమంతుడు సాధించిన విజయాన్ని ఈ సీక్వెల్ కూడా సాధిస్తుందేమో చూడాలి.