Posted [relativedate]
పెద్దనోట్లను రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయంపై మీరు ఏమనుకుంటున్నారో తెలుపండి అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలను కోరారు. తన యాప్లోకి లాగిన్ అయ్యి.. తమ అభిప్రాయాలు తెలుపాలని ప్రజలకు సూచించారు. ‘కరెన్సీ నోట్ల విషయమై మీ సొంత అభిప్రాయాలను నేను తెలుసుకోదలిచాను. ఎన్ఎం యాప్ (http://nm4.in/dnldapp)లో నిర్వహిస్తున్న సర్వేలో పాల్గొనండి’ అని అడిగారు ప్రతిపక్షాలు ఈ అంశంపై రాజకీయ పోరాటాలకు సిద్ధమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు ఈ తాత్కాలిక కష్టాలను ప్రజలు భరిస్తే.. నల్లధనాన్ని వెలికితీసి దేశానికి ఉజ్వల భవిష్యత్తు అందిస్తానని ప్రధాని మోదీ అన్నారు .. మరి ప్రజలేం చెప్తారో చూద్దాం మోడీ కి .