Posted [relativedate]
ఆమ్నెసియా అంటే మతిమరుపు కేవలం వృద్ధుల్లో మాత్రమే కాదు ఈమధ్య ఒత్తిడి కారణం గా అందరిలో ఈ ప్రాబ్లెమ్ వస్తోంది ఐతే ఏ మతిమరుపు కి కారణం నరాల బలహీనత అంటున్నారు నిపుణులు నరాలలోని జీవ కణాలు బలహీన పడితే తిరిగి కోల్పోయిన శక్తిని పుంజుకోవడం అనేది అరుదు జీవకణాలు క్రమేపి బలహీనపడుతూ జ్ఞాపకశక్తి తగ్గిపోవడమే కాకుండా మెదడు చేసే పనులన్నీ తగ్గుతూ వస్తుంటాయి.
ఈ సమస్య ఉన్న వ్యక్తులకు మాటలు జ్ఞాపకం రాకపోవడం వస్తువుల పేర్లు, వ్యక్తుల పేర్లు మర్చిపోవటంతో మతిమరుపు స్టార్ట్ అవుతుంది మాములుగా ఐతే వృద్ధాప్యంలో ఈ సమస్య వస్తుంది కానీ కొన్ని ప్రమాద సంఘటనలలో కూడా తాత్కాలికంగా ఈ లక్షణాలు కనపడతాయి.
ఈ మతిమరుపుకి ప్రధాన కారణం మంసాయిక వత్తిడి నరాల బలహీనత,మానసిక భ్రమలతో బాధపడేవారికి కూడా ఈ మతిమరుపు తోడవుతుంది.మతిమరుపు తగ్గించటానికి చేతికి అందుబాటులో ఉండే మూలికా చికిత్సలు కొన్నింటిని ప్రయత్నించడం మంచి మార్గం.
**ఎండబెట్టిన 5 గ్రాముల సరస్వతి ఆకులను, నీటిలో నానబెట్టి పొరతీసిన 5 బాదం గింజలను, 5 మిర్యాలను కలిపి నీటితో బాగా మెత్తగా నూరి వడకట్టి కొద్దిగా పంచదార కలిపి రెండు వారాల పాటు ఉదయాన్నే పరగడపున తింటే మతిమరుపు తగ్గుతుంది.
***ఉదయాన్నే 5 గ్రాముల శంఖపుష్పి పువ్వులతో 5 గ్రాముల పటికబెల్లం కలిపి మెత్తగా నూరి పాల తో తీసుకోవాలి.
***ప్రతి రోజు ఉదయాన్నే ఒక ఆపిల్ తిని టీ స్పూన్ తేనెను గ్లాసు పాలల్లో కలిపి తాగుతుంటే మతిమరుపు, మానసిక ఉద్రేకాలను తగ్గిస్తుంది.
**ఒక టీ స్పూన్ జీలకర్ర పొడిని 2 టీ స్పూన్ల తేనెతో కలిపి రోజూ ఉదయం తీసుకుంటే మతి మరుపు తగ్గిస్తుంది.
**మతిమరుపు కలవారు ఫాస్ఫరస్ ఎక్కువగా ఉన్న గింజలు, చిరు ధాన్యాలు, పండ్లరసాలు, ఆవుపాలు, అత్తిపళ్ళు, ద్రాక్ష, ఆరెంజ్, ఖర్జూరాలు మొదలైనవి వాడి ఆహారపదార్థాలలో ఉండేట్టు చూసుకోవాలి. ఎల్లా చేయడం వల్ల మతిమరపు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.