‘ఏ జన్మలోనో నేను పుణ్యం చేసుకున్నాను. అందుకే మహానుభావుడు ఎన్టీఆర్కు మనవడిగా, గొప్ప తల్లిదండ్రులకు కొడుకు గా పుట్టాను. అందుకే ఇంత మంది అభిమానులు నాకు తోడయ్యారు. అభిమానుల రుణం తీర్చలేనిది. మీ రుణం తర్చుకోవడానికి మళ్ళీ మళ్ళీ పుట్టాలనిపిస్తుంది. పుడతానేమో. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. నా 12 సంవత్సరాల జీవితం కళ్ల ముందు కనిపిసిస్తుంది. “నిన్నుచూడాలని” చిత్రంతో ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎటు వెళుతున్నామో కూడా తెలియకుండా ఉండేది. అయితే “స్టూడెంట్ నెం1”, “ఆది”, “సింహాద్రి”…ఇలా సక్సెస్ వస్తుంటే బాగానే ఉంది అనిపించింది. చిన్న వయసు కదా, జీవితం అంతా ఇలాగే ఉంటుంది అనుకున్నాను. అర్ధం కాలేదు.
ప్రతి మనిషి క్రిందకి పడితేనే జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది. అప్పుడప్పుడు దేవుడు మొట్టికాయలు వేసి కిందకి పంపిస్తాడు. నేను లోపల కుమిలి పోయాను. మీరు నా మీద ప్రేమ చూపిస్తూ ఉన్నా కూడా, అభిమానులుగా మీరెంతో బాధపడ్డారు అన్న విషయం నాకు తెలుసు. అలా ఉన్నరోజుల్లో ఒకరోజు వక్కంతం వంశీ నాకో కధ చెప్పాడు. ఆ సినిమా పేరే టెంపర్. వంశీ కథ చెప్పినప్పుడు దూరంగా ఒక వెలుగు కనిపించింది. ఇది బాగుంటుందేమో అనిపిచింది. పూరి లాంటి దర్శకుడు, సత్వహాగా కథ, మాటలు రాసే కేపాసిటి ఉన్నా, వంశీ చెప్పిన కథతో సినిమా చేద్దాం అనడం, ఆ సినిమా చేయడం జరిగింది. ఆ తర్వాత “నాన్నకు ప్రేమతో”. దూరం గా ఉన్న వెలుగు కొంచెం దగ్గరకు వచ్చినట్టు అనిపించింది…గెటప్ చూసి చాలా మంది భయపడ్డారు. అసలు ఈ గెటప్ ఆడియెన్స్ కు కనెక్ట్ అవుతుందా లేదా అని అనుకున్నారు. కానీ సినిమా అభిమానులు, ప్రేక్షకుల ఆశీర్వాదంతో పెద్ద సక్సెస్ కావడంతో, నా గమ్యం కొంచెం దగ్గరయ్యింది.
జనతా గ్యారేజ్ కథ విన్నప్పుడు అనిపించింది. దగ్గర అవుతున్న వెలుగు మాత్రం ఈ సినిమానే అని. మనం ఏదీ ప్లాన్ చేయలేం. నిజానికి రెండు సంవత్సరాల క్రితమే శివ గారు ఈ కథ చెప్పారు. ప్లాప్ సినిమాల్లో బిజీగా ఉండి శివ గారి కథ విన్నాను. అప్పుడు ఉన్న కమిట్మెంట్స్ వలన చేయలేకపోయా. పుష్కరం తర్వాత అద్భుతమైన చిత్రం శివతో చేయాలి అని రాసిపెట్టేసాడేమో ఆ దేవుడు. అందుకే శివతో సినిమా ఇప్పుడు కుదిరింది. రచయిత కలం అగిపోతే తర్వాత ఏ సినిమా చేయాలో అర్థం కాదు. అదే రాతను ఎంత తక్కువ చేసి చూపించాలో ఆ చూపు దర్శకుడికి ఉండాలి. చాలా తక్కువ మంది రచయితలకు రచనతో పాటు దర్శకుడి చూపు కూడా ఉంటుంది. అలాంటి అతి తక్కువ మంది దర్శకుల్లో నా కొరటాల శివ ఉన్నాడని చెప్పడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది.
తను ఒక కథే రాస్తాడు. దానికి ఒక కథానాయకుడిని ఎన్నుకుంటే అతనే చివరి వరకు కథానాయకుడు. అంత మనసు పెట్టి కథ రాసుకుంటాడు. చాలా తక్కువ మంది దర్శకులు మాత్రమే వరుస సక్సెస్లు ఇస్తారు. ఆ వరుసలో చూసుకంటే జనతాగ్యారేజ్ శివకు హ్యాట్రిక్ చిత్రమవుతుంది. అలాగే గొప్పనటుడు, అంతకంటే మించి గొప్ప మనిషి మోహన్ లాల్ గారి తో నటించే అవకాశం ఇచ్చినందుకు జీవితాంతం రుణపడి ఉంటాను. గొప్పనటుడు కంటే గొప్ప మనిషితో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. దేవిశ్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే. మంచి పాట కోసం తనెంత తపన పడతాడో నాకు తెలుసు. మా నిర్మాతలను చూస్తే..అమర్ అక్బర్ ఆంటోని లు గుర్తొస్తారు. మంచి మనసున్న మనుషులు. ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేయాలనుకుంటున్నాను.
ఇక నేను మాట్లాడాల్సిన ముఖ్యమైన వ్యక్తి సినిమాటోగ్రాఫర్ తిరు గురించి. నాకు నాకు బాగా ఇష్టమైన కెమెరామెన్ పి.సి.శ్రీరామ్. బాగా ఇష్టం అయినా చిత్రం క్షత్రియ పుత్రుడు. ఆ సినిమా లో ఆయన దగ్గర అసోసియేట్ గా వర్క్ చేసిన తిరు నా సినిమాకి పని చేయటం చాలా ఆనందం గా ఉంది. అద్భుతంగా వర్కి చేసినందుకు ధ్యాంక్స్. ఇప్పుడు నిస్సందేహం గా ఈయనే నా ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్.
అలాగే ఇక నేను అభిమానులకు రెండు విషయాలు చెప్పాలనుకున్నాను. నాన్నకు ప్రేమతో రిలీజ్ తర్వాత నేను ఎక్కడో చూసాను. నా ఫోటోకు పాలతో అభిషేకం చేస్తున్నారు. నేను దేవుడిని కాదు. నేను మీ తమ్మున్నో, అన్నయ్యనో, స్నేహితుడినో. ఆ పాల ప్యాకెట్ ను ఓ అనాధ శరణాలయంలో ఇస్తే ఆనందిస్తాను. అలాగే నాన్నకు ప్రేమతో సినిమా టైమ్ లో రిలీజ్ రోజు మూగ జంతవును బలి ఇవ్వడం జరిగింది. అలా చేయడం కరెక్ట్ కాదు. అన్నదానం చేయండి అంతే కానీ మూగ జంతువులను బలి ఇవ్వద్దు. ఒక కడుపు నిండుతుంది. అలా చేయడం వల్ల మీకు పుణ్యం వస్తుంది. మీ వల్ల నాకూ పుణ్యం వస్తుంది. నేను చెప్పిన ఈరెండు పాటిస్తారని ఆశిస్తున్నాను,నమ్ముతున్నాను. అభిమానులకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను. ఈ సినిమాతో మోహన్ లాల్, సమంత,నిత్యామీనన్, సాయికుమార్, బెనర్జి, అజయ్, బ్రహ్మాజీ..వీళ్లందరితో వర్క్ చేయడం ఆనందం కలిగించింది“ అన్నారు.
పుష్కరాల గురించి మాట్లాడుతూ :
12 సంవత్సరాల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు పుష్కరాలు వచ్చాయ. ఈ సందర్భంగా వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చిన భక్తులను మన ఆదరాభిమానాలతో గొప్పగా తిరిగి పంపాలి. తెలుగు తనం అంటే ఏమిటో. తెలుగు ఆప్యాయత అంటే ఏమిటో మనం వారికి చూపించాలి. ఈ విషయం లో మీరు అందరూ చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాను.