గవర్నర్ తో పన్నీర్ చెప్పింది ఇదే..

0
587
o panneerselvam to meet governor vidyasagar rao at raj bhavan

Posted [relativedate]

o panneerselvam to meet governor vidyasagar rao at raj bhavan
గవర్నర్ విద్యాసాగరరావు తో తమిళ సీఎం పన్నీర్ సెల్వం భేటీ జరిగింది కేవలం 15 నిమిషాలు మాత్రమే.ఈ పావుగంటలోనే తాను చెప్పదల్చుకున్న అంశాల్ని సూటిగా చెప్పేశారు పన్నీర్.ఇంతకీ ఆయన చెప్పిన ఆ ఐదు విషయాలు ఇవే..

1 . తనతో బలవంతంగా రాజీనామా చేయించారు.
2 .శశికళ చెప్తున్నట్టు ఆమె వెనుక 130 మంది ఎమ్మెల్యేలు వున్నారనడం అబద్ధం
3 . శశికళ స్వార్ధ రాజకీయాలతో తమిళనాడుకి తీవ్ర నష్టం జరుగుతుంది.
4 . మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు మాకే వుంది.
5 . రాజీనామా వెనక్కి తీసుకుంటా..బలనిరూపణకి అవకాశం ఇవ్వండి.

ఈ ఐదు విషయాలు గవర్నర్ కి వివరించారు పన్నీర్.అన్ని విషయాలు విన్న గవర్నర్ నిర్ణయం తరువాత చెప్తానన్నారు.అయితే ఆ భేటీ తర్వాత బయటకు వచ్చిన పన్నీర్ ధర్మమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు 7 గంటలకు శశికళ గవర్నర్ ని కలవనున్నారు.ఆమెతో కేవలం 10 మంది బృందమే గవర్నర్ ని కలిసేందుకు అనుమతి లభించింది.

Leave a Reply