జబర్దస్త్ ఫేమ్ రష్మీ అందాలు ఆరబోసిన చిత్రం గుంటూరు టాకీస్ ..ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం . రష్మి హీరోయిన్ గా, సిద్దు హీరోగా, నరేష్ కీలక పాత్రలో గుంటూరు టాకీస్ సినిమావచ్చింది . ఆర్.కె బ్యానర్ పై ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో అడల్ట్ కామెడీ గా తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ గానూ మంచి విజయం సాధించింది.
ఈ తరుణంలో ఆర్ కె బ్యానర్ అధినేత రాజ్ కుమార్ గుంటూరు టాకీస్ కు సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా గుంటూరు టాకీస్ సినిమా కంటే ఎక్కువగా ప్రేక్షకులను అలరిస్తుందని నిర్మాత తెలిపారు. ఈ సీక్వెల్ లో గుంటూరు టాకీస్ సినిమాలోని నటులతో పాటు, సీనియర్ కమెడియన్స్, నటులు కూడా నటించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.