రియో ఒలింపిక్స్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ సెమీస్లో సానియా మీర్జా, రోహన్ బోపన్న జోడీ పరాజయం పాలైంది. అమెరికాకు చెందిన వీనస్ విలియమ్స్, రామ్ రాజీవ్ జంటపై 6-2, 2-6, (3-10) తేడాతో ఓటమి పాలైంది. తొలి సెట్ను ఈజీగా గెలిచిన సానియా జోడీ.. తర్వాత మ్యాచ్పై పట్టును కోల్పోయి రెండో సెట్ను చేజార్చుకుంది. తర్వాత మ్యాచ్ టై బ్రేక్లో మొదట ఆధిక్యంలో ఉన్న సానియా జోడి.. తర్వాత పలు తప్పిదాలతో వరుసగా ఏడు పాయింట్లను కోల్పోయింది. ఈ విజయంతో వీనస్ విలియమ్స్ జోడీ ఫైనల్స్కు చేరుకుంది. కాంస్యం కోసం సానియా, బోపన్న జోడి ఆదివారం మరో మ్యాచ్లో తలపడనుంధీ