పాలు నీళ్లలా కలిసి పోవాల్సిన వాళ్ళు …ఉప్పునిప్పులా ఉంటున్నారు.కాలంగడిచిన కొద్దీ పరిస్థితి మారు తుందేమో అనుకుంటే…అంతకంతకు దిగజారిపోతోంది..అదేనండి మహారాష్ట్ర లో బీజేపీ,శివసేన కలహాల కాపురం కథ ఇది ..కొత్త సర్కార్ ఏర్పడినప్పటి నుంచి అటు మోడీ,ఇటు ఫడ్నవీస్ మీద శివసేన నిప్పులు తొక్కుతూనే ఉంది.’సామ్నా ‘పత్రిక వేదికగా శరపరంపరంగా విమర్శనాస్త్రాలు సంధిస్తోంది .తాజాగా ఆ పాత్రలోకి బీజేపీ వచ్చేసింది.ఆ పార్టీ ఆధ్వర్యం లోని ‘మనోగత్ ‘పత్రిక లో శివసేన పై విరుచుకుపడింది.దమ్ముంటే తమతో విడాకులు తీసుకోవాలని సవాల్ విసిరింది.అబ్బా….ఏంటో ఈ ‘మహా ‘కలహాల కాపురం.
.