Posted [relativedate]
‘ఘటన’ చిత్రం లో ప్రతినాయకుడి పాత్ర పోషించిన నరేశ్ను తన తల్లి చెంపదెబ్బతో ప్రశంసించారట. ఈ విషయాన్ని నరేశ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.నిత్యామేనన్, క్రిష్ జె. సత్తార్, నరేశ్, కోటా శ్రీనివాసరావు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఘటన’ చిత్రం ఈ నెల 18న విడుదలైంది. శ్రీప్రియ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శివకుమార్ సమర్పించారు. ఈ చిత్రాన్ని చూసిన తన తల్లి విజయ నిర్మల కొట్టి ప్రశంసించారట ప్ర తినాయకుడి పాత్రను చక్కగా పోషించినందుకు ఇది నా బహుమతని చెప్పారు. తర్వాత దీవిస్తూ.. ఇది నా కుమారుడి కోసం.. అన్నారు’ అట ఆవిడ .