Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రకాశం టీడీపీ లో రగులుతున్న కలహాల్ని తమకు అనువుగా మలుచుకునేందుకు వైసీపీ రంగంలోకి దిగింది. అద్దంకి కేంద్రంగా గొట్టిపాటి,బలరాం మధ్య సాగుతున్న రాజకీయ పోరులో ఎంటర్ అయ్యేందుకు వైసీపీ స్కెచ్ వేసింది.టీడీపీ అధిష్టానం వైఖరితో ఆగ్రహంగా వున్న బలరాం ని పార్టీ లోకి ఆకర్షించేందుకు వైసీపీ రహస్య టీం ఒకటి రంగంలోకి దిగింది.జిల్లాలో బలరాం కోరుకున్న సీట్ ఇవ్వడంతో పాటు ఆర్ధిక సహకారం అందిస్తామని ఆ టీం నుంచి వచ్చిన ఆఫర్ ని ఆయన కొట్టిపారేశాడట.దీంతో ఆశ్చర్యపోవడం వైసీపీ వంతు అయ్యిందట. పైకి వైసీపీ తరపున వచ్చిన నేతలకు ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ ని వదిలే ప్రసక్తే లేదని బలరాం కుండబద్ధలు కొట్టినట్టు చెప్పి పంపారట.