Chandrababu Denies Raghu Veera Reddy Request

Date:

Chandrababu Denies Raghu Veera Reddy Request

This is a big example of what the political allegations and criticisms are. With the change in the AP Government Endowment Act, the TDP have been annulled the Yadavas family . The concerned people approached the pcc president Raghuvira Reddy to take this matter to the government. He had written a letter to the CM Chandrababu. Finally, If the decision does not change the decision, Its a note to denies Balaji’s decision. That letter is for the Telugu bullet readers …

గౌర‌వ‌నీయులు
నారా చంద్ర‌బాబు నాయుడు
ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వ‌ర్యులు.

న‌మ‌స్కారం.

విషయం : తిరుమ‌ల శ్రీ‌వారి తొలి ద‌ర్శ‌న వ‌రాన్ని పొందిన స‌న్నిధిగొల్ల వంశ‌స్థుల‌కు భ‌గ‌వంతుడు ఇచ్చిన కైంక‌ర్యాల‌ను య‌ధాత‌దంగా (మిరాసి ర‌ద్దు త‌రువాత బ్రాహ్మ‌ణుల‌కు ఏ సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్నారో ఆ విధంగా) కొన‌సాగించాల‌ని, శ్రీ గొల్ల శ‌ర‌భ‌య్య యాద‌వ్ పేరుపైన స‌ముచిత సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి.

తిరుమ‌ల శ్రీ‌వారి స‌న్నిధిలో తొలి ద‌ర్శ‌న వరం పొందిన శ్రీ గొల్ల శ‌ర‌భ‌య్య వంశ‌స్థులు త‌ర‌త‌రాలుగా అనునిత్యం శ్రీ‌వారి ద‌ర్శ‌నం చేసుకుంటున్నారు. గొల్ల‌మిరాసి అనే పేరుతో శ్రీ‌వారి వ‌ర‌ప్ర‌సాదంగా పొందిన కైంక‌ర్యాల‌ను ఇంత‌కాలం ఈ వంశ‌స్థులు పొందుతూ వ‌చ్చారు. అయితే రాష్ర్ట ప్ర‌భుత్వం ఎండోమెంట్ యాక్టు 34లో తెచ్చిన మార్పుల కార‌ణంగా స‌న్నిధిగొల్ల వంశస్థులు ఇంత‌కాలం పొందిన కైంక‌ర్యాలు ర‌ద్దు అవుతున్నాయి. స‌న్నిదిగొల్ల వంశ‌స్థుల విష‌యంలో టిడిపి మ‌రియు ప్ర‌భుత్వం చేసిన నిర్ణ‌యాలు శ్రీ వెంకటేశ్వ‌ర‌స్వామి నిర్ణ‌యాల‌ను స‌మీక్షించ‌డ‌మే అవుతుంద‌ని, ప్ర‌భుత్వ నిర్ణ‌యాల కార‌ణంగా త‌మ‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని స‌న్నిధిగొల్ల వంశ‌స్థులు ఆందోళ‌న చెందుతున్నారు.

ముఖ్యంగా స‌న్నిధిగొల్ల శ‌ర‌భ‌య్య వంశ‌స్థులు ప్ర‌భుత్వం దృష్టికి తీసుకుర‌మ్మ‌ని మ‌మ్మ‌ల్ని కోరిన విష‌యాల‌ను మీకు తెలియ‌చేస్తున్నాను. ఇంత‌కు ముందే ఈ అంశాల‌ను మీ దృష్టికి విన‌తిప‌త్రం ద్వారా తీసుకువ‌చ్చాను.

1. స‌న్నిధిగొల్ల వంస్థుల‌కు భ‌గ‌వంతుడు ఇచ్చిన కైంక‌ర్యాల‌ను య‌ధాత‌దంగా అన‌గా నేడు బ్రాహ్మ‌ణుల‌కు మిరాశి ర‌ద్దు త‌రువాత ఏ సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్నారో స‌న్నిధిగొల్ల కుటుంబాల‌కు య‌ధాత‌దంగా కొన‌సాగించాలి. అదేవిధంగా ఎండోమెంట్ యాక్టు 34లో స‌వ‌ర‌ణ‌లు చేసి స‌న్నిధిగొల్లల‌కు త‌గిన న్యాయం చేయాలి.

2. గ‌తంలో మిరాశి ఉన్న‌ప్పుడు స‌న్నిధిగొల్ల కుటుంబాలు ఏ విదంగా ఆర్థిక‌సాయం పొందాయో అదేవిధంగా భ‌గ‌వంతుడు వ‌రం పొందిన వీరికి ప్ర‌త్యేక ఆర్థిక సాయం క‌లిగే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాలి.

3. సుప్ర‌భాతం, ఏకాంత సేవ‌ల స‌మ‌యాలు మారినందున న‌లుగురు కైంక‌ర్యంలో ఉండే విధంగా ఏర్పాటు చేయాలి.

4. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఉద్యోగుల‌కు ఇస్తున్న అన్ని స‌దుపాయాల‌ను స‌న్నిధిగొల్ల కుటుంబాల‌కు వ‌ర్తించే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాలి.

5. స‌న్నిధిగొల్ల శ‌ర‌భ‌య్య వంశ‌స్థుల పేరుపైన ఒక మ‌ఠాన్ని ఏర్ప‌ర‌చి అక్‌ండి నుంచి స్వామివారి త‌లుపు తెర‌వ‌డం మ‌రియు మొద‌టి ద‌ర్శ‌నం క‌లిగించ‌డం టిటిడి వారి క‌నీస ధ‌ర్మంగా చేయాలి.

6. శ‌ర‌భ‌య్య విగ్ర‌హాన్ని తిరుమ‌ల‌లో ప్ర‌తిష్టింప‌జేసి పూజా కైంక‌ర్యాలు సైతం జ‌రిపించాలి.

7. స‌న్నిధిగొల్ల శ‌ర‌భ‌య్య విశిష్ట‌త‌ను తెలియ‌జేసే విధంగా సేవా కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌వేశ‌పెట్టాలి. శ్రీ‌వారి భ‌క్తులు స‌న్నిధిగొల్ల వంశ‌స్థుల‌కు న్యాయం జ‌రిగే విధంగా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నాను.

ధ‌న్య‌వాదాల‌తో

డాక్ట‌ర్ ఎన్‌.ర‌ఘువీరారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Finally Happening! Jr NTR’s Devara Telugu Satellite Premiere Likely on ETV

It has been quite a wait since Jr NTR’s...

Ananya Panday faces online backlash over her dance in Chand Mera Dil

Ananya Panday has found herself at the center of...

God of Cricket Comes Home: “Sachin: A Billion Dreams” Gears Up for a Grand Telugu OTT

Released in 2017, Sachin: A Billion Dreams is a...

Drishyam 3 powers ahead at the box office despite divided opinions

Despite opening to mixed reviews, Mohanlal’s much-anticipated Drishyam 3...